ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి పర్యటన అనాసాగరంవాసులకు ఒకింత ఊరటనిచ్చినప్పటికీ ఎటువంటి ఆర్థిక సాయం ప్రకటించకపోవటం వారికి నిరాశ కలిగించింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పటం తప్ప, పార్టీ తరఫున సహాయం ప్రకటించకుండానే చిరంజీవి వెళ్లిపోయారు. అనాసాగరానికి చెందిన 11 మంది ఇటీవల కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.
చిరంజీవి గ్రామ పర్యటన గందరగోళంగా సాగింది. నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవటం, ముందుండి నడిపించే వారే కొరవడటంతో ఎవరింటికి వెళ్లాలో, ఎవరిని పరామర్శించాలో తెలియక చిరంజీవి అయోమయంలో పడ్డారు. నాయకులు ఓ వైపు వెళ్దామని చెబుతుండగా, పోలీసులు మరో వైపు రావాల్సిందిగా కోరారు.
Chiru Confusion In Anaasagaram Tour
Friday, January 29, 2010
Labels:
POLITICS
Posted by
ramesh
at
Friday, January 29, 2010
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment